ఆ తర్వాతే అయోధ్య కేసు విచారణ : సుప్రీంకోర్టు

11 Jul, 2019 11:36 IST|Sakshi

సాక్షి, న్యూ ఢిల్లీ :  మధ్యవర్తుల కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాతే అయోధ్య రామ జన్మభూమి వివాదం విషయంలో విచారణ చేపడతామని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ వివాదంలో సమస్య పరిష్కారం కోసం నియమించిన మధ్యవర్తుల కమిటీ నివేదిక సమర్పించడానికి ఆగస్టు18 వరకు సమయం ఇచ్చారు. మధ్యవర్తుల కమిటీ జరిపిన చర్చల సారాంశాన్ని ఈ నెల 18వ తేదీ వరకంతా సుప్రీంకోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. తదుపరి విచారణను ఈనెల 25కు వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది.

కాగా అయోధ్య వివాద పరిష్కారం మధ్యవర్తిత్వంతోనూ పరిష్కారమయ్యే సూచనలు కనిపించడం లేదని, వెంటనే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని పరిష్కారం చూపాలంటూ సుప్రీంకోర్టులో పిటీషన్‌ దాఖలైన సంగతి తెలిసిందే. రామ జన్మభూమి– బాబ్రీ మసీదు వివాదంలో వాస్తవ కక్షిదారుల్లో ఒకరైన గోపాల్‌ సింగ్‌ విశారద్‌ ఈ మేరకు వేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, జస్టిస్‌ దీపక్‌ గుప్తా, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం స్వీకరించింది.

మరిన్ని వార్తలు