న్యూఢిల్లీ: మరణశిక్షను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్లలో 306 పిటిషన్లను భారత రాష్ట్రపతులు ఆమోదించి.. పిటిషనర్లకు పడిన మరణశిక్షను రద్దుచేశారు. న్యాయ కమిషన్ సోమవారం విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని బహిర్గతం చేసింది. ఉగ్రవాదం, దేశంపై యుద్ధం కేసుల్లో మినహా మిగతా కేసుల్లో మరణశిక్షను రద్దు చేయాలని సిఫార్సు చేసిన ఆ నివేదికలో.. 1950 జనవరి 26 నుంచి మంగళవారం వరకూ రాష్ట్రపతులు పరిష్కరించిన క్షమాభిక్ష పిటిషన్ల వివరాలను తెలిపింది. మొత్తం 437 క్షమాభిక్ష దరఖాస్తులు అందగా, వాటిలో 306 పిటిషన్లను ఆమోదించి, వారి మరణశిక్షను జీవితాంతం జైలుశిక్షగా మార్చారని, 131 పిటిషన్లను తిరస్కరించారని వివరించింది. మరణశిక్ష ఎదుర్కొంటున్న దోషి జీవన్మరణాల భవిష్యత్తు.. అప్పటి సర్కారు అభిప్రాయాలపైనే కాకుండా.. రాష్ట్రపతుల వ్యక్తిగత అభిప్రాయాలపై కూడా ఆధారపడి ఉందని పేర్కొంది. వివరాలు..
క్షమాభిక్ష అభ్యర్థనలపై రాష్ర్టపతులనిర్ణయాలు
అంగీకారం తిరస్కారం మొత్తం
బాబూ రాజేంద్రప్రసాద్ 180 1 181
సర్వేపల్లి రాధాకృష్ణన్ 57 0 57
జాకీర్హుస్సేన్ 22 0 22
వీవీ గిరి 3 0 3
ఫకృద్దీన్ అలీ అహ్మద్ - - -
నీలం సంజీవరెడ్డి - - -
జ్ఞానీ జైల్సింగ్ 2 30 32
ఆర్.వెంకట్రామన్ 5 45 50
శంకర్దయాళ్శర్మ 0 18 18
కేఆర్ నారాయణన్ 0 0 0
అబ్దుల్ కలాం 1 1 2
ప్రతిభాపాటిల్ 34 5 39
ప్రణబ్ ముఖర్జీ 2 31 33