రూ 12 లక్షలు తినేసిన ఎలుక..

19 Jun, 2018 08:54 IST|Sakshi
ఏటీఎంలో ఎలుక పాలైన రూ 12 లక్షలు

సాక్షి, గువహటి : ఏటీఎంల్లో నో క్యాష్‌ బోర్డులతో ప్రజలు అల్లాడుతుంటే అసోంలోని ఓ ఏటీఎంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. టిన్సుకియా లైపులి ప్రాంతంలోని ఓ ఏటీఎంలో ఉంచిన రూ 12.38 లక్షలను ఎలుక  కొరికేసింది. మే 19న ప్రైవేట్‌ సెక్యూరిటీ కంపెనీ ఈ ఏటీఎంలో రూ 29.48 లక్షల విలువైన రూ 2000, రూ 500 నోట్లను నింపింది. ఆ మరుసటి రోజు నుంచి ఏటీఎం పనిచేయడం లేదని స్థానిక పత్రిక పేర్కొంది.

జూన్‌ 11న సెక్యూరిటీ కంపెనీ ప్రతినిధులు ఏటీఎంను తిరిగి ఓపెన్‌ చేయగా రూ 12.38 లక్షలను ఎలుకలు కొరికేసి చిందరవందరగా పడిఉండటాన్ని గుర్తించారు. మెషీన్‌లో దూరిన ఎలుకే ఈ పనిచేసిందని భావిస్తున్నారు. దీనిపై టిన్సుకియా పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా సోషల్‌ మీడియాలో ఇది ఫేక్‌ న్యూస్‌ అంటూ కొందరు నెటిజన్లు పోస్ట్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు