కుప్పకూలిన మిగ్‌ 21 విమానం

25 Sep, 2019 13:10 IST|Sakshi

భోపాల్‌: ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ (ఐఏఎఫ్‌)కు చెందిన మిగ్‌21 శిక్షణ విమానం కుప్పకూలింది. శిక్షణ నిమిత్తం ఇద్దరు పైలెట్లతో వెళ్తున్న మిగ్‌ విమానం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో బుధవారం కూలింది. ఈ ఘటనలో అదృష్టవశాత్తు ఇద్దరు పైలెట్లు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదంలో విమానం పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న ఎయిర్‌ ఫోర్స్‌ అధికారులు స్థానికులు సహాయంతో సహాయ చర్యలను చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు.

మరిన్ని వార్తలు