కశ్మీర్ లో మళ్ళీ కాల్పులు.. ఇద్దరు మృతి

15 Aug, 2016 10:35 IST|Sakshi

శ్రీనగర్ః కశ్మీర్ లోయలో మళ్ళీ తీవ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఉగ్రదాడుల్లో ఇద్దరు భద్రతా సిబ్బంది మరణించగా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కాల్పుల నేపథ్యంలో కశ్మీర్ లోయ మళ్ళీ ఉద్రిక్తంగా మారింది.

శ్రీనగర్ నౌహట్టా డౌన్ టౌన్ లోని చారిత్రక జమా మస్జిద్ దగ్గరలో భద్రతా దళాలపై ఉగ్రవాదులు దాడి జరిపారు. ఉగ్ర దాడిలో భద్రతా సిబ్బంది ఇద్దరు చనిపోగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారని, ఎదురు కాల్పులు కొనసాగిస్తున్నట్లు  పోలీసు అధికారులు చెప్తున్నారు. దేశవ్యాప్తంగా  70వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సమయంలో కాల్పులు జరగడం తీవ్ర ఆందోళన రేకెత్తించింది.  కాల్పుల కలకలంతో అధికారులు భద్రత కట్టుదిట్టం చేశారు.

>
మరిన్ని వార్తలు