సాక్షి, హైదరాబాద్ : కేరళ వరద బాధితులను ఆదుకోవడానికి ఇతర రాష్ట్రాలు, రాజకీయ నేతలతో పాటు సామాన్యులు సైతం తమ వంతు ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. తాజాగా ఎంఐఎం పార్టీ కూడా కేరళ వరద బాధితులను ఆదుకోవడానికి విరాళం ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆదివారం ట్విటర్లో ప్రకటించారు.
మజ్లీస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంఐఎం కేరళ వరద బాధితులకు 16 లక్షల విరాళం అందజేయాలని నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ఈ మొత్తాన్ని సోమవారం కేరళ సీఎం రీలిఫ్ ఫండ్ అకౌంట్లో జమ చేయనున్నామని తెలిపారు. అంతేకాకుండా 10 లక్షల రూపాయల మందులను కేరళకు పంపనున్నట్టు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు కేరళకు సహాయం అందజేయడానికి ముందుకు రావాలని కోరారు.