ఫోర్జరీ వివాదంలో కేంద్రమంత్రి కతేరియా

14 Nov, 2014 11:53 IST|Sakshi
ఫోర్జరీ వివాదంలో కేంద్రమంత్రి కతేరియా

న్యూఢిల్లీ: కొత్తగా కేంద్ర మంత్రివర్గంలో చేరిన మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి రామ్ శంకర్ కతేరియా ఫోర్జరీ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన డిగ్రీ మార్కుల జాబితా ఫోర్జరీకి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలను మంత్రి కతేరియా కొట్టిపారేశారు. ఫోర్జరీ మార్కుల జాబితాకు సంబంధించి 2010లో కతేరియాపై పోటీ చేసిన బీఎస్‌పీ అభ్యర్థి అలహాబాద్ హైకోర్టులో కేసు నమోదు చేశారు.

ఈ అంశాన్ని హైకోర్టు ఆగ్రా సెషన్స్ కోర్టుకు రిఫర్ చేసింది. ఈ నెల 26న ఈ కేసు విచారణకు రానుంది. అయితే ఫోర్జరీ ఆరోపణలను కొట్టిపారేసిన కతేరియా.. తనపై బీఎస్‌పీ ప్రభుత్వం రోజుకు నాలుగు కేసులు పెట్టేదన్నారు. బీఎస్‌పీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎన్నో కేసుల నుంచి తాను బయటపడ్డానని, దీని నుంచి కూడా బయటపడతానని విశ్వాసం వ్యక్తం చేశారు.
 

మరిన్ని వార్తలు