ధైర్యం నింపేందుకే ఆ వీడియో.. కేంద్ర మంత్రి క్లారిటీ

28 Dec, 2017 17:54 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అయిన సైనికుడి వీరమరణానికి చెందిన చివరి వీడియోపై కేంద్రమంత్రి వీకే సింగ్‌ స్పష్టతను ఇచ్చారు. ఆ వీడియోను తాను యువ సైనికుల్లో ధైర్యాన్ని నింపేందుకే పోస్ట్‌ చేసినట్లు తెలిపారు. గత శనివారం పాకిస్థాన్‌ బలగాల కాల్పుల్లో నలుగురు భారత సైనికులు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత పలు వీడియోలు బయటకు వచ్చాయి. అందులో భాగంగానే కేంద్రమంత్రి వీకే సింగ్‌ కూడా ఓ సైనికుడి చివరి వీడియో అంటూ విడుదల చేశారు.

అయితే, ఆ వీడియో అందరూ మొన్న పాక్‌ జరిపిన కాల్పుల్లో వీరమరణం పొందిన మేజర్‌ మోహర్కార్‌ ప్రఫుల్లా అంబదాస్‌ది అని అనుకున్నారు. కానీ, ఆ వీడియో 2009నాటిదని వీకే సింగ్‌ స్పష్టం చేశారు. ఛత్తీసగఢ్‌లోని బస్తర్‌లో మావోయిస్టులు దాడి చేసిన సమయంలో సీఆర్‌పీఎఫ్‌ అధికారి సత్వంత్‌ సింగ్‌ చివరి ఘడియలకు సంబంధించిన వీడియో అని భావిస్తున్నట్లు తెలిపారు. అయితే, ఈ వీడియోను తనకంటే దేశమే ముఖ్యమనుకొని సరిహద్దుల్లో ప్రాణాలు ఫనంగా పెడుతున్న యువ సైనికులకు ధైర్యాన్ని, మనో నిబ్బరాన్ని, నాయకత్వాన్ని నూరిపోసేందుకు పోస్ట్‌ చేసినట్లు వీకే సింగ్‌ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు