కారు నడిపి.. ఇద్దరిని చంపేసిన కుర్రాడు!!

23 Jul, 2014 15:27 IST|Sakshi

వచ్చీరాని డ్రైవింగ్తో కారు నడిపిన 14 ఏళ్ల కుర్రాడు.. ఆ కారుతో ఇద్దరిని తొక్కేసి చంపేయగా.. మరో నలుగురిని తీవ్రంగా గాయపరిచాడు. బుధవారం తెల్లవారుజాము సమయంలో వాళ్లంతా అహ్మదబాద్ నగరంలోని ఫుట్పాత్ మీద పడుకుని ఉండగా ఆ కుర్రాడు కారుతో వేగంగా వచ్చి ఈ దారుణానికి పాల్పడ్డాడు. దానిలిండా ప్రాంతంలోని వాగ్జీభాయ్ చాల్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. వేగంగా వెళ్తున్న కారును అతడు నియంత్రించలేకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసు ఇన్స్పెక్టర్ ఎంఎఫ్ షేక్ తెలిపారు.

ఈ సంఘటనలో మరణించినవారిని సలీం రషీద్ఖాన్ పఠాన్ (40), రషీదా మున్షిఫా షేక్ (40)గా గుర్తించారు. వీరు దానిలిండా ప్రాంతానికి చెందిన కూలీలు. సంఘటన జరిగిన వెంటనే కుర్రాడు అక్కడినుంచి పారిపోయినా, పోలీసులు తర్వాత పట్టుకున్నారు. అతడు హ్యుందయ్ ఐ-20 కారు నడుపుతున్నట్లు పోలీసులు చెప్పారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రిలో చేర్చారు. పిల్లాడి తల్లిదండ్రులను కూడా విచారిస్తున్నారు.

మరిన్ని వార్తలు