సిలిండర్ పేలి బాలుడు మృతి

24 Mar, 2015 14:05 IST|Sakshi

అర్వాల్: గ్యాస్ సిలిండర్ పేలి పన్నెండేళ్ల బాలుడు మృతిచెందాడు. మరో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన బీహార్లోని అర్వాల్ జిల్లా బానియా బిఘాలో చోటుచేసుకుంది. వంట చేసేందుకు స్టవ్ వెలిగించే సమయంలో ఒక్కసారిగా పేలుడు చోటుచేసుకుంది. దీంతో ఐశు కుమార్ అనే పన్నేండళ్ల బాలుడు తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోగా మరో ముగ్గురు కుటుంబ సభ్యులు, మరొక పొరిగింటి వ్యక్తి గాయాలపాలయ్యారు. స్థానికంగా ఉన్న ప్రభుత్వ  ఆస్పత్రికి తరలించి వారికి చికిత్స అందిస్తున్నారు.

మరిన్ని వార్తలు