మైనర్ బాలికను కాల్చి చంపేశారు..

13 Feb, 2015 12:10 IST|Sakshi

బరేలీ: మహిళలు, మైనర్ బాలికలపై ఆకృత్యాలు అంతకంతకూ శృతిమించుతూనే ఉన్నాయి. తాజాగా ఓ మైనర్ బాలిక(14)ను అతి దారుణంగా కాల్చి చంపిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కలకలం సృష్టించింది. రాష్ట్రంలోని సిర్సా గ్రామంలో ఉంటున్న ఆ బాలికను ఓం వీర్, రవీంద్ర అనే ఇద్దరు యువకులు గత కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నారు.  అయితే గురువారం సాయంత్రం ఆ బాలిక బయటకు వెళ్లిన సమయంలో అలిగంజ్ ప్రాంతంలో మరోసారి వేధించసాగారు.

 

ఆక్రమంలోనే వారి వద్ద నున్న తుపాకీతో ఆ బాలికపై విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించి ఓం వీర్ అనే యువకుడ్ని పట్టుకున్న గ్రామస్తులు పోలీసులు అప్పగించారు.  దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  ఈ దారుణానికి పాల్పడిన మరో యువకుడు రవీంద్ర కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ బ్రిజేష్ కుమార్ తెలిపారు. 

మరిన్ని వార్తలు