అహ్మదాబాద్ లో అద్భుతం!

15 Jun, 2016 08:21 IST|Sakshi
అహ్మదాబాద్ లో అద్భుతం!

అహ్మదాబాద్: ఇద్దరు మిత్రులు రోడ్డు పక్కన టీ దుకాణం దగ్గర కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఊహించని ఘటన జరిగింది. వారిపైకి అనూహ్యంగా కారు దూసుకొచ్చింది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే  వారిని కారు గుద్దేసింది. అక్కడున్నవారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. కారు గుద్దేసిన వారికి ఏమైందోనని ఆందోళన చెందారు. అయితే ఈ ప్రమాదం నుంచి వారిద్దరూ స్వల్ప గాయాలతో బయట పడడం విశేషం.

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. కారులోని వ్యక్తి పొరపాటున యక్సిలేటర్‌ పెంచడంతో కారు ఒక్కసారిగా దూసుకొచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పెట్టారు. దీన్ని చూసిన వారంతా 'మిరాకిల్' అని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు