'మహిళలు ఆగ్రహంతో ఉన్నారు'

2 Nov, 2015 12:19 IST|Sakshi

బిహార్: గత పాలకుల తీరుపై బిహార్లో మహిళలు ఆగ్రహంతో ఉన్నారని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. సోమవారం బిహార్లోని పూర్ణియలో మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బిహార్ను లాలూ 15 సంవత్సరాలు, నితీష్ 10 సంవత్సరాలు పాలించారనీ, వీరి జంగిల్ రాజ్ పాలనతో ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శంచారు.

గత పాలకులు తమ అసమర్ధతపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరముందని మోదీ అన్నారు. తాను బిహార్కు రావడాన్ని ప్రతిపక్షాలు ఎందుకు విమర్శిస్తున్నాయో తెలియడం లేదన్న మోదీ.. ప్రజలు అభివృద్ధికి ఓటేయాలని సూచించారు.

 

మరిన్ని వార్తలు