న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నేడు పార్లమెంట్ను కుదిపేయనుంది. రాజ్యసభ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. కాగా నిన్న భూ సేకరణ చట్టానికి వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహించిన ర్యాలీలో రాజస్థాన్కు చెందిన గజేంద్ర సింగ్ అనే రైతు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.
రైతు ఆత్మహత్యపై చర్చించాలంటూ విపక్ష సభ్యులు గురువారం ఉదయం రాజ్యసభలో నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వ తీరు వల్లే రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ఈ అంశంపై ఆయన నేడు సభలో ప్రసంగించే అవకాశం ఉంది. కాగా లోక్సభలోనూ రైతు ఆత్మహత్యపై చర్చ జరిగే అవకాశం ఉంది.
మరోవైపు ఆప్ నేతలు రెచ్చగొట్టడం వల్లే గజేంద్ర సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆప్ నేతలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గజేంద్ర సింగ్ మృతదేహాన్ని అతని స్వగ్రామానికి తరలించారు.