బంగ్లాదేశ్కు పయనమైన మోదీ

6 Jun, 2015 08:40 IST|Sakshi
బంగ్లాదేశ్కు పయనమైన మోదీ

న్యూఢిల్లీ: రెండురోజుల చారిత్రక పర్యటన కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ఉదయం బంగ్లాదేశ్ కు పయనమయ్యారు. ఎయిర్ ఫోర్స్ కు చెందిన రాజ్ దూత్ విమానంలో ఢిల్లీ నుంచి ఆయన బయలుదేరారు. 'ఇప్పుడే బంగ్లాదేశ్కు బయలుదేరా. ఈ పర్యటన ద్వారా ఇరు దేశాల సంబంధాలు మరింత బలపడతాయని ఆశిస్తున్నా' అంటూ నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

రెండు రోజుల పర్యటనలో బంగ్లాతో సరిహద్దు ఒప్పందంతోపాటు ఇరుదేశాల మధ్య వాణిజ్యాన్ని మరింత పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై బంగ్లా ప్రధాని హసీనాతో చర్చల్లో మోదీ పాల్గొంటారు. ఆయనతోపాటు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా బంగ్లా పర్యనలో పాల్గొంటున్నారు. మోదీ కంటే ఒకరోజు ముందే మమత ఢాకా చేరుకున్నారు.

మరిన్ని వార్తలు