అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో మోదీ

7 Mar, 2015 01:35 IST|Sakshi
అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో మోదీ

న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌లో అత్యంత ప్రభావశీలురైన 30 మంది వ్యక్తుల్లో మోదీ ఒకరిగా నిలిచారు.  టైమ్ మేగజైన్ తాజాగా వెల్లడించిన జాబితాలో అమెరికా అధ్యక్షుడు ఒబామాతో పాటు హ్యారీపోటర్ సృష్టికర్త జేకే రౌలింగ్, సింగర్స్ టేలర్ స్విఫ్ట్, బియాన్స్‌లు ఉన్నారు. ట్వీటర్, ఫేస్‌బుక్‌లలో 3.8 కోట్లమంది ఫాలోవర్లున్న మోదీ నాయకుల్లో ఒబామా తరువాత రెండో స్థానంలో నిలిచారు. భారత్‌లోని దాదాపు 20 కోట్లమంది నెటిజన్లను చేరుకోవడానికి సోషల్ మీడియాను మంచి సాధనంగా మోదీ గుర్తించారని పత్రిక తెలిపింది.

మరిన్ని వార్తలు