‘మోదీ పర్యటనతో ఒరిగిందేమీ లేదు’

27 Jun, 2017 11:18 IST|Sakshi
‘మోదీ పర్యటనతో ఒరిగిందేమీ లేదు’

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా పర్యటనతో ఒరిగిందేమీ లేదని కాంగ్రెస్‌ విమర్శించింది. ఆ పార్టీ సినియర్‌ నేత మనీష్ తివారి మోదీ, ట్రంప్‌ మీటింగ్‌పై స్పందించారు.

మనీష్‌ తివారి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. 'మోదీ, ట్రంప్‌ల జాయింట్‌ స్టేట్‌మెంట్‌ నిరాశపరిచింది. అందులో కొత్త విషయం ఏమీ లేదు' అన్నారు. ఓ ప్రైవేట్‌ ఇండియన్‌ ఏవియేషన్‌ కంపెనీ అమెరికాలో ఉద్యోగాలు సృష్టించేందుకు తోడ్పడుతున్నందునే ట్రంప్‌ ప్రశంసలు కురింపించారు అని మనీష్‌ తివారి పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు