ఫిబ్రవరిలో తల్లీకూతుళ్ల సాహసయాత్ర

30 Nov, 2017 08:51 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: నగరానికి చెందిన తల్లీకూతుళ్లు అయిన కెప్టెన్‌ దీపికా మాబెన్, కూతురు అమె మెహతా మహిళాసాధికారత పై జాగృతం క ల్పించడానికి వినూత్న పంథాను ఎంచుకున్నారు. వచ్చే ఫిబ్రవరి చివరి వారం నుంచి  80 రోజుల పాటు 21 దేశాల మీదుగా  50వేల కిలోమీటర్లు ప్రయాణం చేయనున్నట్లు బుధవారం ఇక్కడ తెలిపారు. రెండు సీ ట్లు, ఒక ఇంజన్‌ కలిగిన మోటర్‌ గ్‌లైడర్‌ విమానం ద్వారా ఈ యాత్ర చేపడతామని చెప్పారు. అన్ని అనుమతులు రావడానికి కనీసం మూడు నెలలు పడుతుందని, అందువల్లే ఫిబ్రవరి వరకూ వేచి ఉన్నట్లు చెప్పారు.

>
మరిన్ని వార్తలు