రైలును ఆపి ఇంజన్‌ ఎదుటే..

18 Jul, 2019 20:54 IST|Sakshi

ముంబై : రైలు డ్రైవర్‌ ఉన్నపళంగా రైలును ఆపివేసి ఇంజన్‌ ముందు మూత్రం పోసిన ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. మహారాష్ట్రలోని ఉల్లాస్‌నగర్‌-విఠల్‌వాడి రైల్వే స్టేషన్ల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. ముంబై వెళుతున్న ఈ రైలును డ్రైవర్‌ అర్థంతరంగా ఆపి ఇంజన్‌ ముందే మూత్రవిసర్జన చేయడాన్ని వీడియో తీసిన కొందరు దీన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

రైళ్లలోని డ్రైవర్లు, గార్డుల క్యాబిన్స్‌లో టాయ్‌లెట్స్‌ను ఏర్పాటు చేయాలని ఈ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు డిమాండ్‌ చేశారు. ఇలా చేయడం డ్రైవర్‌ తప్పు కాదని లోకోమోటివ్‌, ఇంజన్‌ సిబ్బంది కోసం టాయ్‌లెట్స్‌ ఏర్పాటు చేయని భారత రైల్వేలదే తప్పని ఓ ట్విటర్‌ యూజర్‌ పేర్కొనగా, డ్రైవర్లు, గార్డుల క్యాబిన్‌లో టాయ్‌లెట్స్‌ ఏర్పాటు చేయాలని మరో ట్విటర్‌ యూజర్‌ కోరారు.​

మరిన్ని వార్తలు