సోనియా గాంధీతో ఎంపీ కోమటిరెడ్డి భేటీ

13 Mar, 2020 03:37 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భువనగిరి కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఢిల్లీలోని ఆమె నివాసంలో గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలోని రాజకీయ పరిస్థితులను ఆమెకు వివరించినట్టు సమాచారం. మున్సిపల్‌ ఎన్నికల అనంతరం పీసీసీ అధ్యక్ష పదవి నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తప్పుకుంటానని ప్రకటించడం, ఇటీవల కర్ణాటక తదితర ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీలకు నూతన అధ్యక్షులను నియమించడం వంటి పరిణా మాల నేపథ్యంలో కోమటిరెడ్డి భేటీ ప్రాధా న్యత సంతరించుకుంది. విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్‌ పార్టీలో పనిచేసిన నేతలకు పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టాలని, అధికార పార్టీని ఎదుర్కొనేందుకు త్వరితగతిన పీసీసీ కమిటీ ఏర్పాటు చేయాలని కోరినట్టు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు