ములాయం సింగ్కు అస్వస్థత

2 Jan, 2017 05:46 IST|Sakshi
ములాయం సింగ్కు అస్వస్థత

లక్నో : సమాజ్ వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ ఆదివారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా అధిక రక్తపోటు రావడంతో లక్నోలోని ఆయన నివాసంలోనే డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

 (చదవండి : ఎస్పీలో మళ్లీ ప్రకంపనలు : 'ములాయం’కే ఎసరు )

ములాయం అనారోగ్యానికి గురికావడంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు పార్టీ నేతల్లో ఆందోళన నెలకొంది. గత రెండు రోజులుగా ఎస్పీలో తలెత్తిన వివాదాల కారణంగానే ఆయన అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్నట్లు సమాచారం. ఈ వార్త తెలుసుకోగానే శివపాల్ యాదవ్ ములాయం నివాసానికి చేరుకున్నారు. డాక్టర్లను అడిగి ములాయం ఆరోగ్యపరిస్థితిని వాకబు చేస్తున్నారు.

(చదవండి : ఈసీ కోర్టులో ‘ఎస్పీ’ బంతి : ఎవరిది పైచేయి!)

మరిన్ని వార్తలు