ఆర్థిక రాజధానిలో నిషేధాజ్ఞలు

1 Jul, 2020 17:08 IST|Sakshi

ముంబైలో 144 సెక్షన్‌

ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబై కరోనా హాట్‌స్పాట్‌గా మారడంతో నిబంధనలను కఠినతరం చేశారు. మహమ్మారి కట్టడికి ముంబై పోలీసులు బుధవారం బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు గుమికూడటాన్ని నిషేధిస్తూ 144 సెక్షన్‌ విధించారు. అత్యవసర పనులు మినహా ఇతర కార్యకలాపాలకు ప్రజలను అనుమతించబోమని ఈ నిషేధాజ్ఞలు జూన్‌ 15 వరకూ కొనసాగుతాయని అధికారులు పేర్కొన్నారు. కాగా ముంబై మహానగరంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. మరోవైపు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను జులై 31వరకూ పొడిగించినట్టు మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే.

చదవండి : ముంబైలో లాల్‌బ‌గ్చా గ‌ణేశ్‌ ఉత్స‌వాలు ర‌ద్దు

మరిన్ని వార్తలు