ముండే కుమార్తెల ఘన విజయం

20 Oct, 2014 01:57 IST|Sakshi
ముండే కుమార్తెల ఘన విజయం

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీతోపాటు లోక్‌సభ ఉప ఎన్నికలో దివంగత బీజేపీ నేత గోపీనాథ్ ముండే కుమార్తెలు పంకజ, ప్రీతమ్‌లు విజయం సాధించారు. పంకజా పర్లి అసెంబ్లీ స్థానం నుంచి ఎన్సీపీ అభ్యర్థిపై 25 వేల ఓట్ల మెజారిటీతో గెలవగా ప్రీతమ్ తన తండ్రి మరణంతో ఖాళీ అయిన  బీడ్ లోక్‌సభ స్థానం నుంచి లోక్‌సభ చరిత్రలోకెల్లా రికార్డు విజయం సాధించారు. 6,96,321 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థిపై గెలిచారు. ఆమెకు 9,22,416 ఓట్టొచ్చాయి.  ఇప్పటి వరకూ ఈ రికార్డు బెంగాల్ నుంచి 2004లో 5,92,502 ఓట్ల తేడాతో గెలిచిన సీపీఎం నేత అనిల్ పేరిట ఉంది.

>
మరిన్ని వార్తలు