మ్యూజిక్ ఫెస్టివల్స్‌లో డ్రగ్స్ మామూలే: గోవా మంత్రి

30 Dec, 2013 01:33 IST|Sakshi

పణజీ: మ్యూజిక్ ఫెస్టివల్స్ వంటి కార్యక్రమాల్లో పాల్గొనేవారు మద్యం, మాదక ద్రవ్యాలను వినియోగించడం మామూలేనని గోవా పర్యాటక మంత్రి దిలీప్ పరులేకర్ ఆదివారం అన్నారు. గోవాలో జరిగిన సన్‌బర్న్ ఫెస్టివల్‌లో కార్యక్రమం జరుగుతున్న చోటే శనివారం ఒక యువకుడు మాదకద్రవ్యాలతో పట్టుబడ్డాడు. మంత్రి పరులేకర్ మాట్లాడుతూ, మద్యం, మాదకద్రవ్యాలు లేకుండా మ్యూజిక్ ఫెస్టివల్స్‌ను ఆస్వాదించలేమని వాటిలో పాల్గొనేవారు భావిస్తుంటారని, ఇందుకు నిర్వాహకులను తప్పుపట్టాల్సిన పనిలేదన్నారు.
 

>
మరిన్ని వార్తలు