బీజేపీ సీఎంలతో మోదీ, షా భేటీ నేడు

21 Aug, 2017 04:09 IST|Sakshi
బీజేపీ సీఎంలతో మోదీ, షా భేటీ నేడు

న్యూఢిల్లీ: బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమం త్రులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షాలు సోమవారం సమావేశం కానున్నారు. ఆయా రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ ప్రతి ష్టాత్మక పథకాల అమలు తీరు, అభివృద్ధి గురించి భేటీలో చర్చిస్తారు. ఈ సమా వేశానికి 13 మంది సీఎంలు హాజరవు తుండగా ఆరు రాష్ట్రాల ఉప ముఖ్యమం త్రులు వస్తున్నారు. కేంద్ర మంత్రులు కూడా పాల్గొంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి. బీజేపీ అధికారంలోకి వచ్చాక బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో మోదీ సమావేశమవడం ఇది మూడోసారి.

మరిన్ని వార్తలు