జపాన్ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న మోడీ

3 Sep, 2014 15:40 IST|Sakshi
జపాన్ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న మోడీ

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని స్వదేశం తిరిగొచ్చారు. బుధవారం మధ్యాహ్నం న్యూఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో మోడీకి విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ స్వాగతం పలికారు.

ఐదు రోజులు జపాన్లో పర్యటించిన మోడీ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వచ్చే ఐదేళ్లలో భారత్కు రెండు లక్షల కోట్ల రూపాయిల ఆర్థిక సాయం చేసేందుకు జపాన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కీలక రంగాల్లో ఇరు దేశాల్లో పరస్పర సహకారంతో ముందుకెళ్లాలని అభిప్రాయపడ్డాయి.

మరిన్ని వార్తలు