పోలీసులపై చిత్ర పరిశ్రమ దుష్ప్రచారం తగదు: మోదీ

30 Nov, 2014 11:56 IST|Sakshi
పోలీసులపై చిత్ర పరిశ్రమ దుష్ప్రచారం తగదు: మోదీ

న్యూఢిల్లీ: సినీరంగం.. సామాన్యుల దృష్టిలో పోలీసుల పట్ల చెడు అభిప్రాయం కలిగించిందని  ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. సినీ ప్రముఖలతో సమావేశం ఏర్పాటు చేసి పోలీసుల త్యాగాల గురించి తెలియజేస్తామని చెప్పారు. ఆదివారం మోదీ గౌహతిలో జరిగిన అన్ని రాష్ట్రాల డీజీపీల సదస్సుకు హాజరయ్యారు.

ఈ సమావేశంలో మోదీ మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చాక విధి నిర్వహణలో 33 వేలమంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. భద్రత వ్యవస్థలో కొన్ని లోపాలు ఉండవచ్చని, మంచిని వదిలి చెడు గురించే ఎక్కువగా ప్రచారం తగదని సినీరంగానికి సూచించారు.

మరిన్ని వార్తలు