కేధార్‌నాథుడికి మోదీ పూజలు

18 May, 2019 10:07 IST|Sakshi

కేధార్‌నాథ్‌ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేధార్‌నాథుడిని సందర్శించుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో శనివారం ఉదయం ఇక్కడకు చేరుకున్న ఆయన ఆలయానికి చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రత్యేక వస్త్రధారణలో స్వామివారిని దర్శించుకున్నారు. ఇక ఉత్తరాఖండ్‌లో రెండు రోజుల పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ ఆదివారం బద్రీనాథ్‌ వెళ్లనున్నారు. రేపు సాయంత్రం ఆయన తిరిగి ఢిల్లీ చేరుకుంటారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
 

మరిన్ని వార్తలు