సూఫీ గాయకుడికి మోదీ అభినందనల వెల్లువ

23 Dec, 2014 08:17 IST|Sakshi
సూఫీ గాయకుడికి మోదీ అభినందనల వెల్లువ

ప్రముఖ సూఫీ గాయకుడు కైలాష్ ఖేర్ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలతో ముంచెత్తారు. ఆయన చీపురుకట్టలు పట్టుకుని వారణాసిలో 'స్వచ్ఛభారత్' కార్యక్రమంలో పాల్గొని వారణాసి వీధులను శుభ్రంచేశారు. ఇటీవలి కాలంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న సెలబ్రిటీ ఆయనే. ఇంతకుముందు ప్రియాంకా చోప్రా సహా పలువురు సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు స్ఫూర్తినిచ్చారు. అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ప్రారంభించి తొమ్మిది మందిని నామినేట్ చేశారు. అప్పటినుంచి ఇప్పటి వరకు ఈ కార్యక్రమం నిరాఘాటంగా సాగుతోంది.

కాగా, కైలాష్ ఖేర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రధాని మోదీ ఆయనను తన ట్విట్టర్ ద్వారా అభినందించారు. వారణాసిలో చీపురు పట్టినందుకు అభినందనలని, ఇది చాలా మంచి ప్రయత్నమని తెలిపారు.

 

మరిన్ని వార్తలు