ప్రైజ్‌మనీని విరాళం ఇచ్చిన మోదీ

22 Feb, 2019 14:50 IST|Sakshi

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీకి.. దక్షిణా కొరియా ప్రభుత్వం ప్రతిష్టాత్మక సియోల్‌ శాంతి బహుమతి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ అవార్డు ద్వారా వచ్చిన కోటిన్నర ప్రైజ్‌మనీని ‘నమామీ గంగే ఫండ్‌’కు విరాళంగా ఇస్తున్నట్లు మోదీ ప్రకటించారు. అంతేకాక తనకు వచ్చిన అవార్డును భారతీయులకు అంకింతం చేస్తున్నట్లు మోదీ వెల్లడించారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘ఈ అవార్డు నాకు ద‌క్కిన వ్య‌క్తిగ‌త‌మైన గౌర‌వం కాదు. ఇది దేశ ప్ర‌జ‌ల‌కు చెందుతుంది.. గ‌త ఐదేళ్ల‌లో భార‌త్ సాధించిన ప్ర‌గ‌తికి ఈ అవార్డు నిద‌ర్శ‌న‌ం. 130 కోట్ల మంది భార‌తీయుల స‌త్తాకు ఈ అవార్డు అంకితమిస్తున్నాను’ అన్నారు మోదీ.

మరిన్ని వార్తలు