సిస్టర్ నిర్మల మృతిపై ప్రముఖుల సంతాపం

23 Jun, 2015 12:48 IST|Sakshi

న్యూఢిల్లీ: సిస్టర్ నిర్మలా జోషి మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ తదితర ప్రముఖులు సంతాపం తెలియజేశారు. సమాజసేవ కోసం నిర్మల తన జీవితాన్ని అంకితం చేశారని మోదీ నివాళులు అర్పించారు.  నిర్మల లక్షలాదిమందికి సేవచేశారని సోనియగాంధీ తన సంతాపం సందేశంలో కొనియాడు.

81 ఏళ్ల నిర్మల మంగళవారం ఉదయం కోల్కతాలో తుదిశ్వాస విడిచారు. మదర్ థెరిస్సా నెలకొల్పిన మిషనరీ ఆఫ్ ఛారిటీస్ బాధ్యతలు నిర్వర్తించారు.
 

>
మరిన్ని వార్తలు