బీజేపీ ఎమ్మెల్యేకు సోకిన క‌రోనా

2 Jun, 2020 09:35 IST|Sakshi

అహ్మ‌దాబాద్ : భార‌త్‌లో క‌రోనా విజృంభిస్తోంది. సామాన్య ప్ర‌జానీకం ద‌గ్గ‌ర నుంచి ప్ర‌జా ప్ర‌తినిధుల వ‌ర‌కు ఎవ‌రినీ వ‌దిలిపెట్ట‌డం లేదు ఈ మ‌హ‌మ్మారి. తాజాగా గుజరాత్‌లోని న‌రోడా బీజేపీ ఎమ్మెల్యే బ‌ల‌రామ్ త‌వానీ క‌రోనా బారిన ప‌డ్డారు. జ‌లుబు, దగ్గు లాంటి ల‌క్ష‌ణాల‌తో ఆస్ప‌త్రిలో చేర‌గా సోమ‌వారం కోవిడ్ ఉన్న‌ట్లు నిర్ధార‌ణ అయ్యింది. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు ముగ్గురు ఎమ్మెల్యేలకు క‌రోనా సోకిన‌ట్లు అధికారిక స‌మాచారం. రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు 17,237 కేసులు న‌మోదుకాగా గ‌త 24 గంటల్లోనే 417 మందికి క‌రోనా పాజిటివ్ అని తేలింది. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌దివేల మందికి పైగానే క‌రోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1063 మంది చ‌నిపోయిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. గుజ‌రాత్ రాష్ట్రవ్యాప్తంగా న‌మోదవుతున్న క‌రోనా కేసుల్లో అత్య‌ధికంగా అహ్మ‌దాబాద్‌లోనే వెలుగుచూస్తున్నాయి. 12,500 కేసుల‌తో అహ్మ‌దాబాద్ అగ్ర స్థానంలో ఉంది. ఇక సూర‌త్‌లో సోమ‌వారం ఒక్క‌రోజే 35 కొత్త క‌రోనా కేసులు న‌మోదుకాగా మొత్తం కేసుల సంఖ్య 1659కు చేరింది. 
(బడులు తెరవద్దు: తల్లిదండ్రులు )


 

మరిన్ని వార్తలు