ఐదు నిమిషాల్లో కరోనా నిర్థారణ

20 May, 2020 17:45 IST|Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌ నాసిక్‌లో ఉన్న ఐటీ సొల్యూషన్స్‌ కంపెనీ, ఈఎస్‌డీఎస్‌ సాఫ్ట్‌వేర్‌ కరోనాను నిర్ధారించే పరికరాన్ని కనిపెట్టింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా పనిచేసే ఈ పరికరం ఛాతీ ఎక్సరే ద్వారా కరోనాను నిర్థారణ చేయగలుగుతుంది. దీనికి సంబంధించి ఆ కంపెనీ ప్రతినిధులు  మాట్లాడుతూ... తమ టెస్టింగ్‌ టూల్‌ ఐదునిమిషాల్లో కరోనాను నిర్థారించగలదని తెలిపారు. ఇంకా వారు మాట్లాడుతూ ఇది పూర్తిగా కాంటాక్ట్‌ లెస్‌ పరీక్షా విధానమని తెలిపారు. దీనిలో ఛాతి ఎక్స్‌- రే రిపోర్టలను తీసుకొని వాటిని వెబ్‌బ్రౌసర్‌లో అప్‌లోడ్‌ చేయాలని, తరువాత సబ్‌మిట్‌ బటన్‌ నొక్కాలని తెలిపారు. తరువాత వెంటనే అది ఆ వ్యక్తి కరోనాతో బాధపడుతున్నాడో లేదో తెలియజేస్తోందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. (డబ్ల్యూహెచ్ఓలో కేంద్ర మంత్రికి కీలక పదవి)

 ఈ విధానాన్ని చైనా, ఫ్రాన్స్‌, ఇజ్రాయిల్‌, యూకే లాంటి ఇతర దేశాలు కూడా అనుసరిస్తున్నాయని కూడా కంపెనీ పేర్కొంది. దీని ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షలు చేస్తోన్నామని, ఇప్పటి వరకు 8,500 ఛాతి ఎక్స్‌-రేలను పరీక్షించామని వాటిలో 96 శాతం మంచి ఫలితాలను ఇచ్చాయని తెలిపారు. గవర్నమెంట్‌ ఆసుపత్రుల్లో ఈ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కరోనా కేసలు రోజు రోజుకు పెరిగిపోతున్న ఈ నేపథ్యంలో కరోనాను తొందరగా నిర్థారించడానికి ఇది బాగుంటుందని ఈఎస్‌డీఎస్‌ సంస్థ సీఈఓ పియ్యూష్‌ సొమానీ తెలిపారు. 
(త్రీస్టార్.. తిరుపతి వన్)

మరిన్ని వార్తలు