జన్మదిన వేడుకలకు నవీన్ పట్నాయక్ దూరం

14 Oct, 2014 20:44 IST|Sakshi
జన్మదిన వేడుకలకు నవీన్ పట్నాయక్ దూరం
భువనేశ్వర్: హుదూద్ తుఫాన్ కారణంగా వేలాదిమంది నిరాశ్రయులైన కారణంగా తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిర్ణయించుకున్నారు. తుఫాన్ తాకిడికి గురైన ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత నవీన్ పట్నాయక్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 
 
అక్టోబర్ 16 తేదిన నవీన్ పట్నాయక్ 68 ఏట అడుగుపెట్టనున్నారు. తుఫాన్ కారణంగా ఎంతోమంది నష్టపోయారని.. అందుకే ఈసారి జన్మదిన వేడుకలకు ముఖ్యమంత్రి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారని సీఎంవో ఓ ప్రకటన జారీ చేసింది. 
మరిన్ని వార్తలు