భారత్‌లో హత్యలకు ముఖ్యకారణం అదే

17 Nov, 2019 15:50 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రేమవ్యవహారాల వల్లే భారత్‌లో అత్యధిక హత్యలు జరుగుతున్నాయని నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) నివేదికల్లో వెల్లడైంది.  ఎన్‌సీఆర్‌బీ ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2001-2017 మధ్య కాలంలో జరిగిన హత్యలకు మూడవ అతిపెద్ద కారణం ప్రేమ వ్యవహారాలే. ఆంధ్రప్రదేశ్‌, పంజాబ్‌, గుజరాత్‌, మహారాష్ట్రల్లో జరిగిన హత్యల్లో అత్యధికంగా ప్రేమ వ్యవహారాలకు సంబంధించినవే. ఇక ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో రెండవ స్థానంలో ప్రేమవ్యవహార హత్యలు ఉన్నాయి. వీటిల్లో ఎక్కువగా వివాహేతర సంబంధాల వల్ల జరిగిన హత్యలే ఉన్నాయి. 

ఎన్‌సీఆర్‌బీ గణాంకాల ప్రకారం 2001లో దేశావ్యాప్తంగా 36,202 హత్య కేసులు నమోదు కాగా, 2017లో 21 శాతం తగ్గి 28,653 కేసులు నమోదు అయ్యాయి. ఇక వ్యక్తిగత కక్ష్యతో చేసే హత్యలు 4.3శాతం తగ్గాయి. ఆస్తి వివాదాల వల్ల జరిగే హత్యల సంఖ్య కూడా 12 శాతం తగ్గింది. ప్రేమ వ్యవహారాలు మరియు వివాహేతర సంబంధాల వల్లే  28శాతం హత్యలు జరుగుతున్నాయని వెల్లడైంది. 2016లో 71 పరువు హత్య కేసులు నమోదు కాగా, 2017లో 92 కేసులు నమోదు అయ్యాయి.  

మరిన్ని వార్తలు