ఆధిక్యాల్లో బీజేపీ ముందంజ

8 Nov, 2015 08:46 IST|Sakshi
ఆధిక్యాల్లో బీజేపీ ముందంజ

బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలైంది. ముందుగా వస్తున్న ఫలితాల్లో.. 47 స్థానాల్లో ఎన్డీయే కూటమి, 25 స్థానాల్లో మహాకూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కనిపిస్తున్నారు. ఇందులో కూడా బీజేపీ అభ్యర్థులు 30 చోట్ల, జేడీయూ అభ్యర్థులు 12 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఎన్డీయే కూటమి తరఫున పోటీలో ఉన్న హిందూస్థాన్ ఆవామీ మోర్చా అధ్యక్షుడు జితన్ రామ్ మాంఝీ, ఆర్జేడీ అధినేత లాలు కుమారుడు తేజస్వి యాదవ్ తదితరులు ముందంజలో ఉన్నారు.

మరిన్ని వార్తలు