ఢిల్లీ-భువనేశ్వర్ రైళ్లు రద్దు

12 Oct, 2013 18:46 IST|Sakshi

ఫైలిన్ తుపాన్ కారణంగా ఢిల్లీ-భువనేశ్వర్ మధ్య రైళ్లను రద్దు చేశారు. ఢిల్లీ నుంచి భువనేశ్వర్ వెళ్లే రైళ్లను అలాగే భువనేశ్వర్ నుంచి ఢిల్లీ వచ్చే రైళ్లను నిలిపివేసినట్టు ఉత్తరాది రైల్వే శనివారం ప్రకటించింది.

ఆదివారం బయల్దేరాల్సిన న్యూఢిల్లీ-భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్ (నెంబర్ 22812)ను, ఈ నెల 14వ తేదీ ఉన్న న్యూఢిల్లీ-పూరి పురుషోత్తం ఎక్స్ప్రెస్ (రైలు నెంబర్ 12802), న్యూఢిల్లీ-పూరినందన్ కణ్నన్ ఎక్స్ప్రెస్ (రైలు నెంబర్ 12816), న్యూఢిల్లీ-భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్ (రైలు నెంబర్ 22806)ను రద్దు చేశారు. 15న బయల్దేరాల్సిన హరిద్వార్-పూరి ఎక్స్ప్రెస్ను ఆపివేశారు.

మరిన్ని వార్తలు