బద్రినాథ్‌ గుడిలో కొత్త బంగారు గొడుగు

11 May, 2018 02:50 IST|Sakshi

గోపేశ్వర: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బద్రినాథ్‌లోని విష్ణు భగవానుడి విగ్రహంపై కొత్త బంగారు గొడుగును ఏర్పాటుచేశారు. నాలుగు కేజీల బరువున్న ఈ గొడుగును లూధియానాకు చెందిన సూద్‌ కుటుంబం కానుకగా సమర్పించింది. ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో దాన్ని దేవాలయానికి తీసుకొచ్చి ప్రత్యేక ప్రార్థనల నడుమ గర్భగుడిలో ప్రతిష్టించారు. సూద్‌ కుటుంబీకులు, దేవాలయ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 600 ఏళ్ల కిత్రం గ్వాలియర్‌ రాచకుటుంబానికి చెందిన మహరాణి అహల్యా బాయ్‌ సోల్కర్‌ సమర్పించిన గొడుగు స్థానంలో కొత్త గొడుగును అమర్చారు. 

మరిన్ని వార్తలు