మహిళల రక్షణ కోసం కొత్త పరికరం

18 Sep, 2013 01:08 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో మహిళలు, వయోవృద్ధుల భద్రత కోసం కేంద్రం ప్రత్యేక పరికరాన్ని రూపొందిస్తోంది. ఈ పరికరం అత్యవసర సమయాల్లో పెద్ద ధ్వనితో అలారం మోగించడంతో పాటు, ముందుగా ఏర్పా టు చేసిన పలు ఫోన్ నంబర్లకు సందేశాన్ని పంపుతుంది. మంగళవారం ఢిల్లీలో జరిగిన ‘సెక్యూర్ సిటీస్-2013’ సదస్సులో కేంద్ర సమాచార, ప్రసార శాఖ అదనపు కార్యదర్శి రాజీవ్ గౌబా ఈ వివరాలు తెలి పారు. ఢిల్లీ ఐఐటీ, తిరువనంతపురంలోని సీడాక్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయన్నారు. అందరికీ అందుబాటులో ఉండే ధరలో, భారీ స్థాయి లో ఉత్పత్తి చేయడం ఈ ప్రాజెక్టులో సవాళ్లన్నారు.

మరిన్ని వార్తలు