పబ్‌జీ.. ఇకపై రోజుకు ఆరు గంటలే!

22 Mar, 2019 22:21 IST|Sakshi

న్యూఢిల్లీ: పబ్‌జీ... ఇదో మొబైల్‌ గేమ్‌. ప్రస్తుతం యువతకు ఈ గేమ్‌ వ్యసనంలా మారింది. ఈ క్రమంలో కొందరు ప్రాణాలు సైతం కోల్పోయారు. దీంతో ఈ గేమ్‌ను బ్యాన్‌ చేయాలని స్వచ్ఛంద సంస్థల దగ్గర్నుంచి రాజకీయ పార్టీల వరకు డిమాండ్‌ చేస్తున్నాయి. ఫలితంగా ఈ గేమ్‌కి అడ్డుకట్ట వేసే పని ప్రారంభమైంది. ఇకపై ఆరు గంటలు మించి పబ్‌జీ ఆడలేరు. ఇండియాలో కేవలం ఆరు గంటలు మాత్రమే పబ్‌జీ ఆడేందుకు అనుమతి లభించింది.

ఎవరైనా రోజుకు 6 గంటలు పబ్‌జీ ఆడగానే తాత్కాలికంగా బ్లాక్‌ అవుతుంది. మళ్లీ మరుసటి రోజు వరకు ఇక పబ్‌జీ ఆడలేరు. పబ్‌జీ 6 గంటలు ఆడగానే హెల్త్‌ రిమైండర్‌ రావడంపై అధికారికంగా ఎలాంటి స్టేట్‌మెంట్‌ విడుదల కాలేదు. కానీ... ప్లేయర్స్‌ మొబైల్‌పై హెల్త్‌ రిమైండర్‌ పేరుతో నోటిఫికేషన్‌ కనిపిస్తోంది. 18 ఏళ్ల లోపు వయస్సుగల ప్లేయర్స్‌కు 2 నుంచి 4 గంటల లోపే హెల్త్‌ రిమైండర్‌ నోటిఫికేషన్‌ వస్తోంది.

మరిన్ని వార్తలు