రైల్వేలో ఆన్‌లైన్‌ టికెట్‌ మోసాలకు చెక్‌!

17 Sep, 2018 04:43 IST|Sakshi

న్యూఢిల్లీ: రైల్వేలో రోజురోజుకూ పెరిగిపోతున్న ఆన్‌లైన్‌ టికెట్ల మోసాలను అరికట్టేందుకు ఆ శాఖ నడుంబిగించింది. ఇందులో భాగంగా రైల్వే చట్టం– 1989కు సవరణలు చేపట్టాలని యోచిస్తున్నట్లు ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అక్రమాలకు పాల్పడే వ్యక్తికి ప్రస్తుతం గరిష్టంగా విధిస్తున్న రూ. 10 వేల జరిమానాను రూ.2 లక్షలకు పెంచాలని ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు. రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ప్రతిపాదించిన ఈ సవరణలను రైల్వే బోర్డు ఆమోదించాల్సి ఉందన్నారు. 

మరిన్ని వార్తలు