కర్ణాటకలో వారికి నో ఎంట్రీ

19 May, 2020 08:12 IST|Sakshi

బెంగళూరు : కరోనా విజృంభణ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యధిక కేసులు నమోదవుతున్న గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ నుంచి వచ్చే వారిని ఈ నెల 31 వరకూ తమ రాష్ట్రంలోకి అనుమతించబోమని సీఎం యడియూరప్ప స్పష్టం చేశారు. అయితే దశల వారీగా వారిని తీసుకొస్తామని తెలిపారు. ఆయా రాష్ట్రాల నుంచి వస్తున్న వారికి కరోనా ఉండటంతో, రాష్ట్రంలోని కేసులు అధికమవుతున్నాయని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం నుంచి ఆ నాలుగు రాష్ట్రాల నుంచి బస్సులు బయలుదేరతాయని చెప్పారు. 

మరిన్ని వార్తలు