1969 చట్టంతో ఎన్నారై పెళ్లి మోసాలకు చెక్

11 Jul, 2016 02:20 IST|Sakshi

న్యూఢిల్లీ : ఎన్నారై వివాహాల్లో మోసపోయిన మహిళలకు విదేశీ వివాహ చట్టం 1969 అండగా ఉంటుందని పార్లమెంటరీ కమిటీకి కేంద్ర న్యాయ శాఖ తెలిపింది. ఎన్నారై పెళ్లిళ్ల మోసాలపై ఏర్పాటైన రాజ్యసభ కమిటీ... హోంశాఖ ఉన్నతాధికారుల్ని, న్యాయ శాఖ అధికారుల్ని కలిసి సమస్య పరిష్కారాలపై చర్చించింది.

ఈ చట్టం గురించి చాలా మందికి అవగాహన లేకపోవడం వల్ల సద్వినియోగం కావడం లేదని కమిటీ సభ్యుడొకరు చెప్పారు. ఎన్‌ఆర్‌ఐ భర్తలు భార్యల్ని వదిలేసిన కేసుల్ని పరిష్కరించేందుకు కేంద్రం కూడా కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

మరిన్ని వార్తలు