అంబరీశ్ దంపతులకు ఎన్టీఆర్ అవార్డు

1 Jun, 2016 01:58 IST|Sakshi
అంబరీశ్ దంపతులకు ఎన్టీఆర్ అవార్డు

బెంగళూరు: కర్ణాటక తెలుగు సాహిత్య అకాడమీ వారు ప్రతియేటా ఇచ్చే ఎన్టీఆర్ స్మారక జాతీయ పురస్కారానికి ఈ ఏడాది శాండిల్‌వుడ్ రెబల్ స్టార్ అంబరీశ్, ఆయన భార్య సుమలతలను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు రాధాకృష్ణ రాజు మంగళవారం మీడియాకు వెల్లడించారు. కళారంగానికి వారు చేస్తున్న కృషిని గుర్తించి అవార్డును అందజేస్తున్నామన్నారు. ఈ నెల 2న నగరంలోని రవీంద్ర కళా క్షేత్రంలో అంబరీశ్ దంపతులకు పురస్కారాన్ని ప్రదానం చేస్తారు.

మరిన్ని వార్తలు