పెళ్లి తర్వాత ప్రమాణ స్వీకారం

25 Jun, 2019 14:23 IST|Sakshi

తృణముల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) నుంచి పోటీచేసి తొలిసారి ఎంపీగా  ఎన్నికయిన నుస్రత్‌ జహాన్, మిమి చక్రబర్తీలు లోక్‌సభ  సభ్యులుగా మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. తమ  ప్రమాణ స్వీకారం ’బంగ్లా’లో చేసిన వీరు, తమ ప్రసంగం చివరలో  ’వందేమాతరం’, ’జై హిందీ’, ’జై బంగ్లా’ వంటి పదాలు  ఉపయోగించారు. తర్వాత వెంటనే లోక్‌సభ స్పీకర్‌ ’ఓం  బిర్లా’కు పాదాభివందనం చేశారు.

నుస్రత్‌ జహాన్‌ ఇటీవలే టర్కీకు  చెందిన వ్యాపారవేత్త నిఖిల్‌ జైన్‌ను వివాహం చేసుకోగా, మిమి  చక్రబర్తీ ఆ వేడుకకు హాజరయ్యారు. దీంతో మంగళవారం సభకు  వచ్చిన ఈ ఇద్దరు లోక్‌సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు.  నుస్రత్‌ జహాన్‌ బసిర్‌హాట్, మిమి జాదవ్‌పూర్‌ నుంచి లోక్‌సభకు  ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 

మరిన్ని వార్తలు