ఏం చేస్తానో చూడండంటూ ఓ వృద్ధుడు!

23 Nov, 2017 21:58 IST|Sakshi

సాక్షి, ముంబై : సాధారణంగా తమకు న్యాయం చేయాలంటూ ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్తే.. ఒక్కో దగ్గర బాధితులకు ఒక్కో అనుభవం ఎదురౌతుంది. తన ఫిర్యాదును పట్టించుకోలేదని తీవ్ర మనస్తాపానికి లోనైన ఓ వృద్ధుడు ఓ ఎత్తైన టవర్ ఎక్కి హడలెత్తించాడు. ఈ ఘటన మహారాష్ట్రలో గురువారం చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. 67 ఏళ్ల ఓ వృద్ధుడు ముంబైలో నివాసం ఉంటున్నారు. ఆయనకు ఏదో సమస్య తలెత్తడంతో ఫిర్యాదు చేద్దామని స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. ఆయన సమస్యను పట్టించుకోని పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో మనస్తాపానికి గురైన ఆ వృద్ధుడు ప్రియదర్శిని సర్కిల్ లో ఉన్న పవర్ టవర్ ఎక్కి.. కిందకి దూకేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని అతికష్టం మీద ఆ వ్యక్తిని కిందకి దించడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వార్తలు