న్యూఢిల్లీ: ప్రధాని మోదీ 67వ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం బీజేపీ ‘సేవా దివస్’ పేరిట పలు కార్యక్రమాలు నిర్వహించనుంది. ఇందులో భాగంగా జరిగే వైద్య శిబిరాలు, రక్తదాన, స్వచ్ఛతా కార్యక్రమాలకు ఆ పార్టీ నాయకులు హాజరవుతారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ రాంచీలో, ఆర్థిక మంత్రిజైట్లీ ఢిల్లీలో, రైల్వే మంత్రి గోయల్ చెన్నైలో, మానవ వనరుల అభివృద్ధి మంత్రి ప్రకాశ్ జవదేకర్ ముంబైలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. గుజరాత్లో నర్మదా నదిపై నిర్మించిన చారిత్రక సర్దార్ సరోవర్ డ్యాంను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం జాతికి అంకితం చేయనున్నారు.