బాంబు దాడిలో జవాను మృతి

30 Jun, 2017 12:09 IST|Sakshi
బాంబు దాడిలో జవాను మృతి

ఉక్రుల్ :
మణిపుర్లోని ఉక్రుల్ జిల్లాలో చోటుచేసుకున్న బాంబు పేలుడులో ఓ జవాను మృతిచెందాడు. శుక్రవారం తెల్లవారజామున జరిగిన ఈ బాంబుపేలుడులో అసోం రైఫిల్స్కు చెందిన ఒక జవాను మృతిచెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. సంఘటనా స్థలాన్ని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకొన్నాయి.

జూన్ 15న కూడా అసోం రైఫిల్స్పై జరిగిన దాడిలో ఒక జవాను మృతిచెందాడు. ఈ దాడి తామే చేశామంటూ రెవెల్యూషనరీ పీపుల్స్ ఫ్రెంట్(ఆర్పీఎఫ్) ప్రకటించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు