లైంగిక దుష్ప్రవర్తన.. గవర్నర్‌పై ఫిర్యాదు?

28 Feb, 2018 13:12 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ : దక్షిణాదిలోని ఓ రాష్ట్ర గవర్నర్‌పై సంచలన ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజ్‌భవన్‌ ఉద్యోగినిపై ఆయన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలిసింది. బాధితమహిళ ఫిర్యాదు మేరకు కేంద్ర హోం శాఖ రంగంలోకి దిగి, దర్యాప్తు సంస్థలతో రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం. ఈమేరకు ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ ప్రచురించిన ఓ కథనం చర్చనీయాంశమైంది. కాగా, ఆ గవర్నర్‌ ఏ రాష్ట్రానికి చెందినవారన్న సంగతి మాత్రం ఇంకా వెల్లడికాలేదు.

‘‘తన పట్ల గవర్నర్‌ అసభ్యంగా ప్రవర్తించాంటూ రాజ్‌భవన్‌ ఉద్యోగిని చేసిన ఫిర్యాదును కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. ఆరోపణల్లో నిజమెంతో తెలుసుకునేందుకు రహస్యంగా విచారణ చేపట్టింది. ఒకవేళ అవి నిజమని తేలితే ఆయనను పదవి నుంచి తొలగించే అంకాశముంది. అయితే ఈ వ్యవహారంపై స్పందించేందుకు కేంద్ర శాఖలు నిరాకరిస్తున్నాయి’ అని టైమ్స్‌ కథనంలో పేర్కొన్నారు. గతేడాది జనవరిలో శణ్ముగనాథన్‌ మేఘాలయా గవర్నర్‌గా ఉన్నప్పుడు సరిగ్గా ఇదే తరహా ఆరోపణలు రావడంతో నాటి రాష్ట్రపతి ప్రణబ్‌.. గవర్నర్‌ను రీకాల్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది.

మరిన్ని వార్తలు