20 వేలకు చేరువైన పాజిటివ్‌ కేసులు

31 May, 2020 19:27 IST|Sakshi

వైరస్‌ హాట్‌స్పాట్‌గా ఢిల్లీ

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా కేసులతో దేశ రాజధాని ఢిల్లీ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఆదివారం ఒక్కరోజే ఢిల్లీలో వరుసగా నాలుగో రోజు వేయికిపైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1295 తాజా కేసులు నమోదవడంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,844కి చేరువైంది. మహమ్మారి బారినపడి మరణించిన వారి సంఖ్య 473కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో 13 మంది మరణించారని అధికారులు వెల్లడించారు.

ఇక చికిత్స అనంతరం సోమవారం 416 మంది డిశ్చార్జి అయ్యారు. ఇక మహారాష్ట్ర, తమిళనాడు తర్వాత ఢిల్లీ కరోనా హాట్‌స్పాట్‌గా మూడోస్ధానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఇక కరోనా వైరస్‌ను దీటుగా ఎదుర్కొంటామని, వైరస్‌పై ఢిల్లీ వాసులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు.

చదవండి : ‘జీతాలు చెల్లించాలి.. రూ. 5 వేల కోట్లివ్వండి’

>
మరిన్ని వార్తలు